మాదిగలకు మూడు పార్లమెంటు స్థానాలు కేటాయించాలని వినతి

సిరా న్యూస్,పెద్దపల్లి;
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మాదిగలకు మూడు పార్లమెంటు స్థానాలను కేటాయించాలని కోరుతూ మాదిగ శక్తి ఆద్వర్యంలో వెయ్యి డప్పులతో తరలివెళ్ళీ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు బొంకూరి సురేందర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 80లక్షల మంది మాదిగలు ఉన్నారని, పెద్దపల్లి, వరంగల్ పార్లమెంటు పరిధిలో ఎనిమిది లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మాదిగలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు నిచ్చినట్లు తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని గజ్జెల కాంతం, వరంగల్ స్థానాన్ని పిడమర్తి రవి, మరో జనరల్ స్థానాన్ని కూడా మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రాలు అందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ సంఘాల సమైఖ్య, మాదిగ జేఏసీ, మాదిగ సంక్షేమ సంఘం, మహా ఎంఆర్పీఎస్, తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ, తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘాల నాయకులు గజ్జెల ఆనందరావు, పేట భాస్కర్, కళ్లేపల్లి రవి, కుక్క చంద్రమౌళి, సముద్రాల అజయ్, మీసాల సాయిలు, రాచపల్లి వంశీ, దూడ భూమయ్య, చెవుల మద్ది వినోద్, మల్యాల తిరుపతి పుల్లురి నాగరాజు, సుందర్, సతీష్, కిషోర్, పర్వతాలు, సదయ్య, రవీందర్, పవన్, కిశోర్, శివా, కనుకయ్య, నరేష్, భూమయ్య, కాంతయ్య, అంజయ్య, చొప్ప దండి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *