గోదావరిఖని టూటౌన్ సీఐ రవీందర్
సిరా న్యూస్,కమాన్ పూర్;
వృద్ధాశ్రమానికి తమ వంతుగా సహాయ సహకారాలు చేస్తానని గోదావరిఖని టూ టౌన్ సిఐ బి రవీందర్ అన్నారు. గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని
వీర్లపల్లి గ్రామంలో గల ఈశ్వర కృప వృద్ధాశ్రమమును గోదావరిఖని టూ టౌన్ ఇన్స్పెక్టర్ బి రవీందర్ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఆశ్రమంలో గల వృద్ధులను కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నరు.అనంతరం
ఆశ్రమానికి సిఐ 25 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ బి. రవీందర్ మాట్లాడుతూ….. ఎల్లప్పుడూ తన తరఫున, పోలీస్ స్టేషన్ తరఫున ఆశ్రమానికి సహాయ సహకారాలు అందుతాయని వారు అన్నారు.ఇట్టి కార్యక్రమంలో ఈశ్వర కృప వృద్ధాశ్రమం అధ్యక్షులు పి.టి. స్వామి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గంటా సతయ్య , ఎల్ మాధవరెడ్డి , ఎ రామచందర్ రావు, కోటగిరి శ్రీనివాసరావు, జాకా సత్య నారాయణ తదతరులు పాల్గొన్నారు.