సిరా న్యూస్,రామడుగు;
రామడుగు మండలం చిప్పకుర్తిలో నాలుగో విడత పశు గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి పశుసంవర్ధక శాఖ అధికారి బి నరేందర్ పరిశీలించారు. రైతులకు తగు సూచనలు ఇచ్చారు. జిల్లా పశు వైద్య పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి నరేందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు విధిగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించాలని పశువులను ప్రాణాంతకరమైన గాలికుంటు వ్యాధి భారీ నుండి రక్షించుకోవాలని రైతులకు సూచించారు. అలాగే ఈ వేసవికాలంలో పశువులకు ఎల్లవేళలా చల్లని త్రాగునీరు అందుబాటులో ఉంచాలని అన్నారు. పశువులకు నీటిలో బెల్లం ఉప్పు కలిపి అందించడం వల్ల పశువులకు వడదెబ్బ తాగే అవకాశం ఉండదని అన్నారు. ఈ టీకా కార్యక్రమం తర్వాత వచ్చే నెలలో సంకరజాతి ఆవులకు థైలేరియా టీకాలు ఇవ్వడం జరుగుతుందని డాక్టర్ బి నరేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రామడుగు మండల పశు వైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్ గుండి పశు ఆరోగ్య ఉప కేంద్రం వెటర్నరీ లైవే స్టాక్ ఆఫీసర్ ఎన్ గిరిధర్ రామడుగు పశువైద్య కేంద్రం వెటర్నరీ అసిస్టెంట్ టి శంకర్ గౌడ్ సిబ్బంది పాల్గొన్నారు.