-ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు పట్ల హర్ష వ్యక్తం చేసిన ఆర్యవైశ్యులు
సిరా న్యూస్,మంథని;
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు కు క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల మంథని ఆర్యవైశ్యలు హర్షం వ్యక్తం చేశారు, దశాబ్దాల కాలంగా ఆర్యవైశ్యుల చిరకాల కోరిక అయినా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులకు ఆర్యవైశ్య సంఘాల నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించారు. బుధవారం మంథని పట్టణంలోని గాంధీ చౌక్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి సైతం పూలమాలలు వేసి పాలభిషేకం నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం సంఘం రాష్ట్ర నాయకుడు నల్మాచు ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు.కార్పొరేషన్ ఏర్పాటుతో పేద వైశ్యులకు ఆర్థికంగా లాభం చేకూరుతుందని వారు పేర్కొన్నారు. మంథనిలో తామంతా మంత్రి శ్రీధర్ బాబు కు మద్దతుగా నిలుస్తూ వెన్నుదన్నుగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు ఎల్లంకి వంశీ, ఓల్లాల సత్యనారాయణ, కొమురవెల్లి విజయ్ కుమార్, రేపాల నాగన్న, కొంతం వివేక్, ఓల్లాల వెంకటేశ్వర్లు, మహారాజ శ్రీనివాస్, కొమురవెల్లి రాజు, కొత్త శ్రీనివాస్, కొమురవెల్లి రమేష్, రేపాల ఉమాదేవి, రేపాల రమేష్, కెశెట్టి సురేష్, సదానందం లతో పాటు
100 మంది ఆర్యవైశ్యులు పాల్గొన్నారు