సిరా న్యూస్, ఓదెల
అభివృద్ధే ధ్యేయం
* పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట
* బీటీ రోడ్డుకు శంకుస్థాపన
అభివృద్ధే ధ్యేయంగా ముందుకుసాగుతామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. గురువారం ఓదెల మండలం నాంసానిపల్లి గ్రామం నుండి కాల్వశ్రీరాంపూర్ మండలం, లక్ష్మిపూర్ గ్రామం వరకు నూతన బి.టి రోడ్డు నిర్మాణం కోసం రూ.3 కోట్ల రూపాయల నిధులతో శంఖుస్థాపన చేశారు. ఈసందర్భంగా పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు మాట్లాడారు. దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఓదెల ఎంపిపి .కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రేమ్ సాగర్ రెడ్డి, నాగపురి రవికుమార్ . గోపు నారాయణరెడ్డి.పోత్కపల్లి పీఏసీఎస్ చైర్మన్ సుమన్ రెడ్డి. బైరీ రవి . నిమ్మ నాయక్ , ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.