పవన్ సొంత జిల్లాలో జనసేన కు ఐదు సీట్లు ఖరారు

సిరా న్యూస్,కొవ్వూరు;
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాల్లో ఐదింట జనసేన పోటీ చేయనుంది. ఐదుగురు నేతలకు మంగళగిరి లో అభ్యర్థిత్వం జనసేనాని పవన్ ఖరారు చేసారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి అంజిబాబు కు భీమవరంలో ఘనస్వాగతం లభించింది. భీమవరం లో భారీ మెజారిటీతో గెలుస్తామని అంజిబాబు అంటున్నారు. నరసాపురం నుండి బొమ్మిడి నాయకర్, తాడేపల్లిగూడెం నుండి బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు నుండి పత్సమట్ల ధర్మరాజు, నిడదవోలు నుండి కందుల దుర్గేష్ అభ్యర్థులుగా ఖరారు చేశారని అంజిబాబు మీడియాకు వెల్లడించారు.
====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *