సిరా న్యూస్, ఆదిలాబాద్
ప్రజా పాలన కాదు.. ప్రజా రోదన
* కాంగ్రెస్ చెప్పిన గొప్పలు.. ప్రజలు పడుతున్న తిప్పలు..
* అందని సంక్షేమం..ఆగని సంక్షోభం…
* 100 రోజులు గడిచిన అందని గ్యారంటీలు
* ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకులు మజర్
ప్రజా పాలన కాదు.. ప్రజా రోదన అని ఆదిలాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నాయకులు మజర్ అన్నారు. గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి ఓటు వేసిన జనం ఈరోజు పథకాలు అందక ఎండలో తిప్పలు పడుతున్న సందర్భన్నీ చూసి స్పందించారు. 3 నెలలు గడుస్తున్నా కనీసం మూడు పథకాలు కూడా అమలు కాలేవు అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కరెంటు పోవడం మోటార్లు కాలడం విచిత్రం అన్నారు. అంచనా వేయకుండా హామిలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ప్రజా పాలన కేంద్రాలలో సరియైన సమాచారం అందక ప్రజలు అయోమయంలో ఉన్నారని అన్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన ప్రజా పాలన లేదని ఇది ప్రజా రోదన అని వాపోయారు.. కేసీఆర్ చెప్పినట్టు గానే దరఖాస్తుల పాలన అమలులోకి వచ్చిందని అమాయక ప్రజలను ఆఫీసుల చుట్టూ తిరిగేలా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ కె దక్కుతుందన్నారు. గతంలో తీసుకున్న ప్రజా పాలన దరఖాస్తులు ఏమయ్యాయని మళ్ళీ కొత్తగా వారిని కౌంటర్ల దగ్గర లైనులో నిల్చోబెట్టడం ఏంటని అన్నారు.. ప్రజా పాలన అంటే ప్రజలు రోడ్డెక్కడం కాదని ఇంటి వద్దకె పాలన అందించడం అని తెలియక రేవంత్ రెడ్డి పేరు తప్పు పెట్టారని అన్నారు.