Suhasini Reddy: క‌లెక్ట‌ర్ ను క‌లిసిన సుహాసినిరెడ్డి

సిరా న్యూస్, ఆదిలాబాద్‌
క‌లెక్ట‌ర్ ను క‌లిసిన సుహాసినిరెడ్డి
* ప‌లు స‌మ‌స్య‌ల‌పై విన‌తి ప‌త్రం అంద‌జేత‌
అదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో నూతన కలెక్టర్ రాజర్షి షాను గురువారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి మర్యాద పూర్వకంగా క‌లిశారు. ఈ సందర్బంగా కొమరం కాలని వాసులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంత‌రం ఆదివాసి సంఘాల నాయకులు,కాలని వాసులతో కలిసి వినతి పత్రం అందజేశారు.అలాగే పట్టణంలో నీ ఇందిరమ్మ కాలనికి వెళ్ళే దారిలో గల పశువద శాల వల్ల కాలని వాసులు ఎదుర్కుంటున్న సమస్యల గురించి వివరించి దానిని వేరే చోటకి తరలించాలని,కే ఆర్ కే కాలనిలో మరుగుదొడ్లు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గురించి కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *