మారేడుగొండ లో గ్రామ సర్వే

గాయత్రి డిగ్రీ, పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం

సిరా న్యూస్,పెద్దపల్లి;
గాయత్రి డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక శిబిరమును మూడవరోజు మారేడుగొండలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మారేడుగొండ లో గ్రామ సర్వే నిర్వహించారు. ఇందులో ఏ.మధుసూదన్ హెల్త్ ఎడ్యుకేటర్ కే ప్రభాకర్ డిపి పిఎం మధుసూదన్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్, సీజనల్ ఫుడ్స్ తినాలని, ప్రతి రోజు ఒక గ్రుడ్డు, ఆరెంజ్ జ్యూస్ తాగాలని హెల్త్ టిప్స్ చెప్పారు. వారానికి మించి దగ్గు, జ్వరం, ఆకలి లేకపోవడం, రాత్రిపూట చెమటలు పట్టడం, బరువు తగ్గడం మొదలగునవి టిబి లక్షణాలు అని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఏం.ఏ. సమద్, ఉద్యపాకురాలు ఆమని ఎన్.ఎస్.ఎస్ వాలంటరీస్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *