సిరా న్యూస్,పరవాడ;
పరవాడ మండలం, ఈదులపాక బోనంగి, బొద్దపువాణిపాలెం గ్రామంలో లో బూడిద్మాను చెరువు మరియు బొద్దపువానిపాలెం రైతుల ఉమ్మడి చెరువుగా పిలవబడే సర్వే నెంబర్ 184 లో సుమారు వారం రోజుల్లో 5 కోట్ల విలువ చేసే మట్టిని, గ్రావెల్ ను అక్రమ గ్రావెల్ దొంగలు తరలించుకుపోయారు.రాత్రి దొంగలుగా అవతారం ఎత్తిన గ్రావెల్ ముఠా చెరువు గట్టు తొలగించడం భారీగా అక్రమ గ్రావెల్ త్రవ్వకాలు చెయ్యడం మళ్ళీ అదే రాత్రి తెల్లవారెసరికి గట్టు ముయ్యడం ఇక్కడ గ్రావెల్ దొంగలు తెలివి. కష్టపడి బ్రతకలేక వారు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు.ఈధులపాక బోనంగి గ్రామం అంటే అవనీతి పుట్టగా మారిపోయిన వైనం. అధికారులు మొద్దు నిద్ర మరియు కాసుల కక్కుర్తి వల్ల ప్రభుత్వ అదాయానికి భారీ నష్టం కలుగుతుంది .ఈ ప్రాంతం లో సరైన నిజాయితీ గల నాయకత్వం లేకపోవడం ఇక్కడ చెప్పుకో దగ్గ విషయం.నిబంధనలకు విరుద్ధంగ, ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ ఈబోనంగి సర్వే నెంబర్ 184 లో జరుగుతున్న అక్రమ గ్రావెల్ బాగోతం అటు పరవాడ పోలీస్ స్టేషన్ కి మరియు తహసీల్దార్ కార్యాలయానికి అత్యంత సమీపంలో ఉన్న దీని పై చర్యలు తీసుకోకపోవడం ఈ బోనంగి రెవిన్యూ అధికారులు ఈ తతగంపై అధికారులుకు పిర్యాదు చెయ్యకపోవడం మరియు గ్రావెల్ దొంగతనాలు అరికట్టకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. తక్షణమే బొద్దపు వాణిపాలెం గ్రావెల్ దొంగలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని అక్కడ రైతులు, స్థానికులు మరియు ఈబోనంగి గ్రామస్థులు రెవిన్యూ అధికారులును,మైనింగ్& విజిలెన్స్ అధికారులను మరియు అనకాపల్లి జిల్లా కలెక్టరు వారిని కోరుచున్నారు, లేని పక్షములో చలో కలెక్టరేట్ పేరుతో జిల్లా కలెక్టర్ కార్యలయంనందు ధర్నా చేస్తామని పత్రిక ముఖంగా అక్కడ రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.