Payal Shankar:అన్నదాతకు అన్నం పెట్టడం నా అదృష్టం

సిరా న్యూస్, జైన‌థ్‌
అన్నదాతకు అన్నం పెట్టడం నా అదృష్టం
* ఆదిలాబాద్ ఎంఎల్ ఏ పాయల్ శంకర్
* మార్కెట్ యార్డులో పాయల్ శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం
అన్నదాతకు అన్నం పెట్టడం నా అదృష్టమ‌ని ఆదిలాబాద్ ఎంఎల్ ఏ పాయల్ శంకర్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా జైన‌థ్ మండల మార్కెట్ యార్డులో రైతుల సౌకర్యార్థం పాయల్ శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధికంగా సోయాబీన్ పండించే ప్రాంతాలు జైన‌థ్, బేలా మండలాలు మద్దతు ధరలేని కారణంగా రైతులు ఆయా పంటలను అమ్ముకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఆయా సంస్థల ద్వారా పంటను కొనుగోలు చేసే ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. తమ పంటలను అమ్ముకోవడానికి మార్కెట్ యార్డ్ కు వస్తే ఆదిలాబాద్ లాంటి మార్కెట్ యర్డ్లలో చుట్టుప్రక్కల్లో హోటళ్లు వంటివి అందుబాటులో ఉంటాయి, కానీ జైన‌థ్, బేలా వంటి ప్రాంతాల్లో కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేదన్నారు. పాయల్ శంకర్ పౌండషన్ ఆధ్వర్యంలో 500 మందికి గురువారం భోజనం ఏర్పాటు చేశామన్నారు. అన్నదాత కు అన్నం పెట్టే భాగ్యం ఈ రోజు తనకు లభించిందన్నారు. గతంలో కూడా అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోలేదన్నారు. కనీసం ఇకనైనా ఇలాంటి ప్రాంతాల్లో రైతులకు భోజనం, స్వచ్ఛమైన మంచినీరు అందించాలన్నారు. అలాగే వారితోపాటు వచ్చే మూగ జీవులకు త్రాగునీటి సౌరకర్యం చెబుతానే ఏర్పాటు చేయాలన్నారు. రైతుల నుండి ప్రభుత్వం లాభాలను ఆర్జిస్తున్నప్పుడు కొంత వారికోసం తప్పని సరిగా ఖర్చు చేయాలన్నారు. కార్యక్రమంలో జైనథ్ మండల నాయకులు రాందాస్, రాకేష్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డి ,అశోక్, రమేష్ ముకున్, భూమన్న, రాకేష్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *