సిరా న్యూస్, కడెం
రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం
* ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తున్నాం
* కేటీఆర్కు కడెం ప్రాజెక్ట్ ఎక్కడుందో తెలియదు
* కేటీఆర్ సిఎం రేవంత్ రెడ్డి పై విమర్శలు చేయడం మానుకోవాలి
* ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* కడెం ప్రాజెక్ట్ మరమ్మతుల పనులకు భూమి పూజ
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ మరమ్మతు పనులకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గతంలో ప్రభుత్వ తప్పిదం వల్ల కడం ప్రాజెక్ట్ డేంజర్ జోన్లోకి వెళ్ళిందన్నారు.కేటీఆర్ కు కడం ప్రాజెక్ట్ ఎక్కడుందో తెలియకపోవడం విడ్డూరం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కడం ప్రాజెక్టుకు 5కోట్ల 46 లక్షలను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి,ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డికు ఖానాపూర్ నియోజకవర్గ ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కేటీఆర్ కు దమ్ముంటే కడెం ప్రాజెక్ట్ ఎక్కడుందో చూ పెట్టాలని, లేని యెడల రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. గతంలో కడం ప్రాజెక్ట్ సందర్శనకి వచ్చిన తమకి పోలీసులను అడ్డుపెట్టి అపడం జరిగిందని పేర్కొన్నారు. కడెం ప్రాజెక్ట్ మరమ్మత్తుల పనుల కారణంగా ఈసారి క్రాప్ హాలిడేగా ప్రకటించడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,500 కు గ్యాస్, రైతుబందు,ఆరోగ్య ప్రమాద బీమా, ఇందిరమ్మ ఇండ్లు లాంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. కుప్టి ప్రాజెక్టు నిర్మాణ పనులను సైతం త్వరలో చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కడం ప్రాజెక్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు