సిరా న్యూస్, బోథ్
సీసీ రోడ్డు, జగదాంబ దేవి మందిర నిర్మాణాలకు భూమి పూజ
* మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కేశవ గూడ గన్ పూర్ గ్రామాలలో గురువారం సిసి రోడ్ల నిర్మాణంతోపాటు మురికి కాలువల నిర్మాణానికి మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి భూమి పూజ చేశారు. అలాగే ఘనపూర్ గ్రామంలో జగదాంబ దేవి సేవాలాల్ మందిర నిర్మాణానికి భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడ గజేందర్ నిధులు మంజూరు చేయించడం జరుగుతుందని, ఆయన సహకారంతో గ్రామాలను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల మాజీ సర్పంచులు లక్ష్మణ్ పటేల్ కిషన్ మేస్రం కాసిరం మార్కెట్ కమిటీడైరెక్టర్ అబ్బో అబ్రాస్ మహేందర్ లతోపాటు ఎంపీటీసీ మహేందర్, నాయకులు గాజుల పోతన్న, అమృతరావ్, రాథోడ్ నారాయణ నాయక్, భగవాన్దాస్ పటేల్ సింగల్, అంకుష్ తదితరులు పాల్గొన్నారు.