సిరా న్యూస్,బోథ్
ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గంగా గుర్తింపు పొందిన ముదిరాజుల సంక్షేమం కోసం ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి హర్షం వ్యక్తం చేస్తూ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గురువారం బోథ్ బస్టాండ్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా పలువురు ముదిరాజ్ సంఘం సభ్యులు మాట్లాడుతూ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల వివిధ కులాల వారు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదిగే వీలుందని పేర్కొన్నారు .గత కొన్ని సంవత్సరాలుగా ముదిరాజులను బీసీఏలో కలుపుదామని తీసుకున్న జీవో నెంబర్ 15 యధావిధిగా అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి శివయ్య ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుజ్జ నారాయణ బోత్ ముదిరాజ్ సంఘం గౌర అధ్యక్షులు గొండారాజు లింగాల భోజన్న బొజ్జ సాయన్న రాజు, తుమ్మ మహిపాల్, నిండు శ్రీనివాస్, తుమ్మ శ్రీధర్, సున్నం శ్రీనివాస్, ముత్యం గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.