PRTU Telangana: పీఆర్‌టీయూ తెలంగాణ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

పీఆర్‌టీయూ తెలంగాణ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు

ఆదిలాబాద్‌ జిల్లాలోని పలు పాఠశాలల్లో పీఆర్‌టీయూ తెలంగాణ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. గురువారం సంఘం ఆదిలాబాద్‌ శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆడే నూర్‌ సింగ్, నర్ర నవీన్‌ యాదవ్, తదితరులు నేరడిగొండ, బోథ్‌ ప్రాథమిక పాఠశాలలు, రోల్‌ మామడ మిని గురుకులం, కిష్ఠాపూర్‌ ప్రాథమిక పాఠశాల, టీడబ్ల్యూపీఎస్‌ దేవులతాండ, బాలికల గిరిజన ఆశ్రమోన్నత పాఠశాల లక్కంపూర్, కేజీబీవీ బోథ్, మోడల్‌ స్కూల్‌ బోథ్‌లలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సభ్యత్వ నమోదు కార్యక్రమానికి భారీ స్పందన వస్తోందని అన్నారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గాల్‌ రెడ్డి హర్షవర్ధన్‌ రెడ్డి నాయకత్వంపై ఉపాధ్యాయులు పూర్తి నమ్మకంతో ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా గిరిజన ఆశ్రమోన్నత పాఠశాల ప్రధానోపాద్యాయులు అశోక్‌ రావును శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జాదవ్‌ ప్రకాష్, నేరడిగొండ మండల అధ్యక్షులు జాదవ్‌ అంబారావ్, మండల ఆర్థిక కార్యదర్శి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *