ప్రచారం ప్రారంభించిన ఆరణి

సిరా న్యూస్,తిరుపతి;
తిరుపతి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్తూరుకు చెందిన ఆరణి శ్రీనివాసులు పేరు ప్రకటించడంతో ఈరోజు ఉదయం స్థానిక కపిలతిర్థంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు. అనంతరం తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు.
అదే సమయాన వైకాపా అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి ఎదురుపడటంతో ఒకరినొకరు పలకరించుకున్నారు. ప్రస్తుతం స్థానిక తెదేపా,జనసేనా పార్టీల నాయకులు,కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో పనిచేస్తారా,లేదా వేచిచూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *