సిరా న్యూస్,బోథ్
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందు ఉంచేందుకు కృషి
* 100 రోజుల పాలనలో ఇచ్చిన హామీలు అమలు
* నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్
* బస్సు డ్రైవర్, కండక్టర్ లకు సన్మానం
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందు ఉంచేందుకు కృషి చేస్తానని నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ అన్నారు.
శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి వచ్చిన బస్సు డ్రైవర్ కండక్టర్ సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 రోజుల పాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నో హామీలను నెరవేర్చడం జరుగుతుందని పేర్కొన్నారు . 100 రోజులలో 25 కోట్ల మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న రోజుల్లో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వమని ఈ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో అండగా నిలవాలని కాంగ్రెస్ నాయకులు కోరారు.కార్యక్రమంలో నాయకులు అమృత రావు, సంఘపాల్ విశ్రాంత ఉపాధ్యాయులు నరసయ్య తదితరులు ఉన్నారు.