సిరా న్యూస్,తలమడుగు
పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేత
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కేజీబీవీ పాఠశాలలో శుక్రవారం పీఆర్టీయూ తెలంగాణ సంఘం ఆదిలాబాద్ జిల్లా శాఖ తరపున విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేశారు. ఈసందర్భంగా పదో తరగతి విద్యార్థులకు పరీక్ష పాడ్స్ పెన్స్, పెన్సిల్ పంపిణీ చేస్తూ బాలికల విద్యా ప్రాముఖ్యత వివరించారు. పిల్లలందరూ 10జీపీఏ తో పాస్ కావాలని జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోరారు.ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు ఆడే నూర్ సింగ్, ప్రధాన కార్యదర్శి నర్రా నవీన్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షలు రూపావత్ దినేష్, వేణు , మేకల రవికాంత్, కేజీబీవీ సిబ్బంది సంధ్య, శ్వేత, గీత, రేవతి తదితరులు పాల్గొన్నారు