పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్ టికెట్ వంశీకృష్ణకే ఇవ్వాలి

సిరా న్యూస్,పెద్దపల్లి;
: పెద్దపల్లి ఎస్సీ రిజర్వుడు పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణకే కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వునుకొండ శ్రీధర్ పటేల్ అధిష్టానాన్ని కోరారు. పెద్దపల్లిలో శుక్రవారం మీడియా సమావేశంలో సీనియర్ నాయకులు సజ్జాద్ తో కలిసి మాట్లాడారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కాకా వెంకటస్వామి కుటుంబంతో ఎంతో అభివృద్ది జరిగిందని గుర్తు చేశారు. విశాఖ ట్రస్టు ద్వారా ఎన్నో ప్రజాహిత సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో మంచి గుర్తింపు పొందారని అన్నారు. కాకా కేంద్ర మంత్రిగా, వివేక్ ఎంపీగా ప్రజలకు విశేష సేవలందించారని తెలిపారు. కాకా వెంకటస్వామి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు సేవలందించేందుకు వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణకు పెద్దపల్లి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిపేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని కోరారు. కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల అభివృద్దే ధ్యేయంగా ముందుకెళ్తున్న వంశీకృష్ణ గెలుపు సులభమని ధీమా వ్యక్తంచేశారు. వంశీకృష్ణ అభ్యర్థిత్వాన్ని వెంటనే ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. సమావేశంలో నాయకులు బాలసాని సతీష్ గౌడ్, ఉనుకొండ భూమయ్య, వైకుంఠం, అడ్డగుంట శ్రీనివాస్, ఇమ్రాన్, కోతుల ప్రవీణ్, కోరం నరేందర్ రెడ్డి, బండి రాజు, అనుమాల మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *