సిరాన్యూస్, భీమదేవరపల్లి
కరీంనగర్ పార్లమెంట్ అభివృద్దే బండి సంజయ్ ఏకైక లక్ష్యం
బిజెపి భీమదేవరపల్లి మండల పార్టీ అధ్యక్షులు పైడిపల్లి పృథ్వీరాజ్ గౌడ్
కరీంనగర్ పార్లమెంట్ అభివృద్దే బండి సంజయ్ ఏకైక లక్ష్యమని భారతీయ జనతా పార్టీ భీమదేవరపల్లి మండలం బీజేపీ మండల అధ్యక్షులు పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ అన్నారు. భీమాదేవరపల్లి మండలం అభివృద్ధి కోసం 25 కోట్లు రోడ్డు అక్కనపేట మండలం అంతక్ పేట నుంచి కొత్తకొండ గ్రామం వరకు 25 కోట్ల రూపాయలు సి ఆర్ ఎఫ్ ఫండ్ నుండి సాంక్షన్ చేయడం జరిగింది. శుక్రవారం సందర్బంగా కొత్తకొండ గ్రామంలో బీజేపీ నాయకులు ప్రజలకు స్వీట్లు పంచుతూ గాంధీ సర్కిల్లో టపాసు లు కాల్చుతూ సంబురాలు జరుపడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి లక్ష్యంగా బండి సంజయ్ కుమార్ అహర్నిశలు కష్టపడుతూ అభివృద్ధి పనులల్లో దూసుకుపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతులకు, పెద, బడుగు, బలహీన వర్గాల కోసం ఎస్సీ. ఎస్టీ మైనార్టీల కోసం ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానని ముందుండేటువంటి వ్యక్తి మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ అని తెలిపారు. రాబోయే రోజులలో మరోసారి గెలిచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడని పూర్తి విశ్వాసాన్ని తెలియజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు దొంగల కొమురయ్య. ప్రధాన కార్యదర్శిలు గోదల సంపత్. శ్రీరామోజు శ్రీనివాస్. దొంగల వేణు. అంబీర్ కవిత. పిల్లి రవీందర్. మేట్టు అశోక్ రావు. నాగవెల్లి సంపత్, కంకల సదానందం, ముంజల నారాయణ, అఖిల్వని అనిల్. సొప్పరి నవీన్. తదితర నాయకులు పాల్గొన్నారు.