సిరాన్యూస్,బేల
గ్రామాలకు ప్రారంభమైన ఆర్టీసీ సర్వీస్
* ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లకు ఘన సన్మానం
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి, బేదోడ, మనియార్ పూర్, గ్రామాలకు గత కొన్ని ఏళ్లుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. దీంతో ఆదిలాబాద్ఎ మ్మెల్యే పాయల్ శంకర్ ఆర్టీసీ అధికారులతో మాట్లాడి గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. అధికారులు స్పందిస్తూ గ్రామాలకు శుక్రవారం నుంచి బస్సు సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లను సన్మానించారు. ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.