సిరాన్యూస్,కుందుర్పి
బాధిత విద్యార్థికి ఇన్పినిటి చారిటబుల్ ట్రస్ట్ చేయూత
* రూ.20వేల ఆర్థిక సాయం అందించిన చైర్మన్ బద్దె నాయక్
విద్యార్థి బానుప్రకాష్ కు అండగా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ అండగా నిలిచారు. శుక్రవారం శెట్టూరు మండలం యాటకల్లు గ్రామానికి చెందిన తలారి శిల్పమ్మ,తలారి నాగరాజు పెద్ద కుమారుడు భానుప్రకాష్ ఇంటికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను కలిశారు. ప్రమాదం లో గాయపడ్డ విద్యార్థి బానుప్రకాష్ ను పరామర్శించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే…యాటకల్లు ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బానుప్రకాష్ ఆడుకుంటూ ప్రమాదవ శాత్తు కిందపడిపోయాడు. ఈ క్రమంలో విద్యార్థి కి వెన్నముక దెబ్బతింది. ఆసుపత్రి లో చికిత్స చేయించగా ఆపరేషన్ చేస్తే కోలుకుంటారని డాక్టర్లు చెప్పారని తల్లి తండ్రులు అప్పులు చేసి ఆపరేషన్ చేయించుకున్నారు. అయితే ప్రస్తుతం మందులకు డబ్బులులేక ఇబ్బంది పడుతున్నారని మిత్రుల ద్వారా ఇన్ఫినిటీ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ దృష్టికి తీసుకురాగా స్పదించిన ఆయన వారికి ట్రస్ట్ ద్వారా రూ.20,000/- చెక్కును అందజేశారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఈరన్న, ఉపాధ్యాయులు ఫణింద్ర, ట్రస్ట్ సభ్యులు సురేష్,తిప్పేస్వామి,లోకేష్,మహలింగపా తదితరులు పాల్గొన్నారు.