సిరాన్యూస్,బోథ్
జాతీయ లోక్ ఆదాలత్ ను విజయవంతం చేయండి
* బోథ్ జూనియర్ సివిల్ జడ్జి బి హుస్సేన్
ఈనెల 16న నిర్వహించే జాతీయ లోక్ ఆదాలత్ కార్యక్రమంను విజయవంతం చేయాలని బోథ్ జూనియర్ సివిల్ జడ్జి బి హుస్సేన్ తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్లో ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం ఉదయం 10. 00 గంటలకు బోథ్ కోర్టు ప్రాంగణంలో నిర్వహించనున్న కార్యక్రమంలో రాజీకి అవకాశం ఉన్న కేసులు బ్యాంకు నేరరోపణ కేసులు పరిష్కారం చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ అవకాశంను కక్షి దారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.