సిరాన్యూస్,భీమదేవరపల్లి
బావిలో అరుదైన పిల్లి
* అడవి శాఖ అధికారులకు అప్పగింత
భీమదేవరపల్లి మండలం లోని కొత్తపల్లి గ్రామానికి చెందిన శివారు భూమిలో నిమ్మ రాజిరెడ్డి బావి లో ఒక అరుదైన పిల్లి ప్రమాదవశాత్తు పడింది. అది చూడటానికి పునుగు పిల్లి లేదా మాను పిల్లి (ఇప్పపిల్లి)లాగా కనబడుతుంది. ఫారెస్ట్ అధికారులు సమాచారం ప్రకారం స్థానిక రైతు బావిలో పడిన అరుదైన పిల్లి ని చూసి సమాచారం ఇవ్వగా రిస్క్ టీమ్ స్పందించి బావిలోకి దిగి ఫారెస్ట్ అధికారులు అటవీ శాఖ జూ పార్క్ కు తరలించారు. అనంతరం వైద్య పరీక్షలు జరిపి ఆరోగ్యంగా ఉన్నట్లయితే తిరుపతి జూకు తరలిస్తామని అడవి శాఖ అధికారులు తెలిపారు.ఇటువంటి అరుదైన జాతికి సంబంధించిన పిల్లిని బావిలో పడిన దృశ్యాన్ని గుర్తించిన రేణిగుంట రాజు సరియైన సమయంలో అడవి శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆయనను అభినందించారు. ఇదిలావుండగా పునుగు పిల్లి లేదా మాను పిల్లి (ఇప్పపిల్లి) గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అడవుల్లో ఎక్కువ సంచరిస్తాయని తెలియవస్తుంది. ఈ జంతువు విసర్జించిన మలం తో కాఫీ తయారీ వాడకంలో ఉపయోగిస్తారని తెలిసింది.దీని నుంచి వచ్చే తైలం తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి కి అభిషేకం చేస్తారు.