ఈ సారి ప్యారాచూట్ లీడర్సే కే టిక్కెట్లు

 సిరా న్యూస్,హైదరాబాద్;
భారతీయ జనతా పార్టీ విడుదల చేసిన రెండో జాబితాలో ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకే టికెట్లు ఖరారు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు సంపాదించి మూడో సారి నరేంద్రమోదీని ప్రధానమంత్రిని చేయాలనే లక్ష్యంతో కమలనాథులు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీలో చేరిన నలుగురు నేతలకు బీజేపీ టికెట్లు ఇచ్చారు. దీనిపై గత కొంత కాలంగా బీజేపీలోపనిచేస్తున్న సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఇది సహజమే.మొదటి జాబితాలోనూ ఫిరాయింపు దార్లకే పెద్ద పీట వేశారు. రెండో జాబితా అంతే. ఇక మూడో జాబితాలో రాబోయే రెండు సీట్లుఫిరాయింపు నేతలకే ఇవ్వడం ఖాయం. తెలంగాణలో బలపడ్డామంటున్న బీజేపీకి బలమైన అభ్యర్థులు లేరా ? ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, మాజీ ఎంపీ గొడం నగేష్ ను బీఆర్ఎస్ పార్టీ నుంచి రప్పించికాషాయం కండువా కప్పిన మూడు రోజుల్లోనే టికెట్టు ఇచ్చారు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న బీజేపీ గోండు వర్గానికి చెందిన గొడం నగేష్ ను బరిలోకి దించడంద్వారా విజయం సాధించాలని అనుకుంది. ఆదిలాబాద్ బీజేపీ టికెట్టు ఆశించిన సిట్టింగ్ ఎంపీ సోయంబాపురావు, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ లు తీవ్ర అసంతృప్తి జ్వాలలతో రగులుతున్నారు. పార్టీలో ఉన్న తమనుకాదని బీఆర్ఎస్ పార్టీ నేతకే టికెట్టిస్తారా అని వారు మండిపడుతున్నారు. పార్టీకి ఎవరూ లేని సమయంలో బీజేపీలో చేరి పోటీ చేసి.. ఎంపీగా గెలిచానని సోయం బాపూరావు అంటున్నారు. పార్టీలో తనకు అవమానంజరిగిందని.. పార్టీ మారిపోవడానికి సిద్ధమని ఆయన అంటున్నారు. మహబూబాబాద్ ఎస్టీ రిజర్వుడ్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ ను బీజేపీ బరిలోకిదించింది. ఇటీవల వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి సీతారాం నాయక్ ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఢిల్లీకి పిలిపించి ఆయనకు కేంద్ర నేతలతో కాషాయ కండువా కప్పిఎన్నికల బరిలోకి దించారు.

మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డిని నల్గొండ ఎంపీ బరిలో దించారు. బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సైదిరెడ్డి కమలం పార్టీలో చేరిన మూడు రోజులకే టికెట్ దక్కించుకున్నారు. బీజేపీమొదటి జాబితాలోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు .. బీజేపీ అభ్యర్థులుగా ఎంపీ ఎన్నికల్లో బరిలోకి దించారు. మొదటి జాబితా ప్రకటించడానికి ముందు నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ బీజేపీలో చేరిపోయారు. వారికి టిక్కెట్లు ఇచ్చేశారు. పోతుగంటి రాములు కుమారుడికి చాన్సిచ్చారు. ప్పటికే 9 మంది అభ్యర్థులను మొదటి జాబితాలో ప్రకటించింది. నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్,కరీంనగర్ నుంచి బండి సంజయ్, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, మల్కాజిగి నుంచి ఈటల రాజేందర్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, హైదరాబాద్ నుంచి మాధవి లత , జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, నాగర్ కర్నూలు నుంచి భరత్, చెవేళ్ల నుంచి కొండ విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేస్తారు. ఇందులో బండి సంజయ్ , కిషన్ రెడ్డి మాత్రమే బీజేపీని అంటి పెట్టుకుని ఉన్నారు. మిగతా అంతా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే. రెండోజాబితాతో కలిసి మొత్తం తెలంగాణలో పదిహేను స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లు అయింది. ఇంకా రెండు స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఒకటి ఖమ్మం నియోజకవర్గం కాగా.. మరొకటి వరంగల్ నియోజకవర్గం.ఈ రెండింటిలోనూ ఫిరాయింపు దార్లకే చాన్సివ్వనున్నారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. సొంత పార్టీ నేతలకు పెద్దగా బలం లేకపోవడంతో ఇతర పార్టీల నేతలు ఆసక్తిచూపిస్తున్నారు. రెండు రోజుల కిందట జలగం వెంకట్రావు పార్టీలో చేరారు. అయితే ఆయనకు టిక్కెట్ ప్రకటించలేదు. మరో కీలక నేత కూడా బీజేపీ తరపున పోటీకి సిద్ధమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. వరంగల్ నుంచి ఆరూరి రమేష్ పేరు ప్రచారంలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *