సిరా న్యూస్, చిగురుమామిడి
కవిత అరెస్టు అప్రజాస్వామికం
* ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి
* బస్ స్టాండ్ చౌరస్తాలో రాస్తారోకో
బీఅర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడి అధికారులు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని చిగురుమామిడి ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి అన్నారు.శనివారం మండల కేంద్రంలోనీ బస్ స్టాండ్ చౌరస్తాలో మండల పార్టీ అధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. వారు మాట్లాడుతూ లిక్కర్ కేసులో ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు..కేంద్ర బిజేపి ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షడు మామిడి అంజయ్య, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, ప్యాక్ చైర్మన్ జంగా రమణారెడ్డి ,మాజీ రైతుబంధు సమితి అధ్యక్షులు పెనుకుల తిరుపతి, ఎంపిటిసిలు మిట్టపల్లి మల్లయ్య, మంకు శ్రీనివాస్ రెడ్డి , ఫ్యాక్స్ వైస్ చైర్మన్ కర్వేద మహేందర్ రెడ్డి , మాజీ సర్పంచ్ సుద్దాల ప్రవీణ్ మగ్గుల్ పాష గ్రామ శాఖ అధ్యక్షులు కత్తుల రమేష్ , పిల్లి వేణు చామకూర సంపత్ రెడ్డి, ఎస్.కె సిరాజ్ భాష యాళ్ల జనార్దన్ రెడ్డి, బుర్ర తిరుపతి మండల బీసీల అధ్యక్షులు హనుమాన్ల, సత్యనారాయణ నాయకులు కొత్త కైలాసం నగెల్లి రాజిరెడ్డి, సర్వర్ పాషా కలవల రాజేశ్వర్ రెడ్డి, దేశినిరాజయ్య మహంకాళి కొమురయ్య, దొరపాడు కృష్ణారెడ్డి ,దరిపెల్లీ సంపత్ తదితరులు పాల్గొన్నారు.