సిరా న్యూస్, ఆదిలాబాద్
ఎలాంటి ఒత్తిడికి లోనుకవద్దు
* డాక్టర్ డా.సర్ఫరాజ్
విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకవద్దు డాక్టర్ డా.సర్ఫరాజ్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ రూరల్ మామిడిగూడ పదవ తరగతి విద్యార్థులకు మామిడిగుడాలో పరీక్ష సెంటర్ ఉన్నందున విద్యార్థులకు వారి మానసిక స్టార్యాన్ని పెంచి బలోపేతంచేసే విధంగా డా.సర్ఫరాజ్ అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 18 వ తేదీ మొదలై ఈనెల 30 వరకు జరిగే పరీక్షల మీదా ట్రెస్ ( ఒత్తిడి) లేకుండా పూర్తి నమ్మకంతో అలోచించిపరీక్షలు రాయాలని ఎలాంటి ఒత్తిడికిలోనూకవద్దని చెప్పారు. మొదలు వచ్చిన వాటిని రాసి తరువాత వేరేవి రాయలన్నారు. కార్యక్రమంలో డా.సర్ఫరాజ్,హెల్త్ అసిస్టెంట్ పవర్ ప్రేమ్ సింగ్,స్కూల్ ఇంచార్జి హేడ్మాస్టర్ సుగుణ,ఏ.ఎన్. ఏం.కామేశ్వేరి,ఆశ రుక్మిణి. స్కూల్ టీచర్లు,విద్యార్థులు పాల్గొన్నారు.