– రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ మంత్రి దనసరి అనసూయ సీతక్క
సిరా న్యూస్,ములుగు;
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.శనివారం రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ మంత్రి దనసరి అనసూయ సీతక్క
ములుగు మండలం లోని జగ్గన్న పేట గ్రామం లో 10 లక్షలతో సీసీ రోడ్,10 లక్షల తో ప్రాథమిక పాఠశాల ప్రహరి గోడ నిర్మాణం,చిన్న గుంటూరు పల్లె లో 5 లక్షలతో సీసీ రోడ్లు, కాసిందేవిపేట గ్రామం లో 5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం వేంకటాపూర్ మండలం లోనిలక్ష్మి దేవిపేట భూర్గు పేట గ్రామం మధ్యలో ఉన్న బొదర వాగు పై కోటి పదిహేను లక్షల రూపాయల నిధులతో హై లెవల్ నుతన వంతెన నిర్మాణ పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు.అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ములుగు-104, గోవిందా రావు పేట – 45, వేంకటా పూర్ – 77.మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి,
షాది ముభారక్ చెక్కులను మంత్రి అందచేశారు. తదుపరి గ్రామీణ మంచినీటి సరాఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) చే జిల్లా లోని గ్రామ పంచాయితి సెక్రెటరీ లకు త్రాగునీటి పరిక్ష పరికరాలను ( క్లోరోస్కోప్) మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయితీ రాజ్,గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ మంత్రి దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వం అందించే అవకాశాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఇప్పటికే మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం అందించమని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగిందని, పెండిoగ్ లో ఉన్న కళ్యాణ లక్ష్మి,షాది మురక్ చేక్కు లను ఈ రోజు అందించడం జరిగిందని అన్నారు. మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లానే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఆన్నారు.
రాబోయే వేసవి కాలంలో జిల్లా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు అన్ని ఏర్పాట్లూ చేసుకోవాలని, గ్రామ పంచాయితి పరిధి లోని ఓ హెచ్ ఎస్ ఆర్ లలోనీ నీటి నీ పరీక్షించి వాటర్ విడుదల చేయాలని మంత్రి సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్లు పి. శ్రీజ,
సి.హెచ్. మహేందర్ జి, ఆర్ డి ఓ సత్య పాల్ రెడ్డి, ఆర్ డబ్లు ఎస్ ఎస్ ఈ మల్లెశం, ఎంపిపి గండ్ర కోట శ్రీదేవి, రజిత, ప్రజా ప్రతినిధిలు, సంబంధిత అధకారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
=======================