సిరా న్యూస్, ఆదిలాబాద్
కంది శ్రీనివాస రెడ్డి పరామర్శ
ఆప్తులను కోల్పోయి బాధల్లో ఉన్నవారి చెంతకు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి పయనమయ్యారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని రాంపూర్ గ్రామంలో సురుకుంటి రుక్మారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందడంతో ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.అనంతరం తలమడుగు మండలం కొత్తూరు గ్రామంలో లోక నారాయణ రెడ్డి సతీమణి లోక జ్యోతి చనిపోవడంతో ఆయన నివాసంలో భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు.