Rajarshi Shah: పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

సిరా న్యూస్,ఆదిలాబాద్‌
పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
* పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
* జిల్లా పాలన అధికారి రాజర్షి షా
ఈ నెల 18 వ తేది నుండి ఏప్రిల్ 2 వ తేది వరకు నిర్వహించే పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, పరీక్షల నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారి పై నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా పాలన అధికారి రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈనెల 18వ తేదీ నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయని, ఈసారి నిమిషం నిబంధనలను ఎత్తివేయగా ఐదు నిమిషాల వరకు విద్యార్థులను అనుమతించడం జరుగుతుందని అన్నారు. పేపర్ లీకేజ్ వంటి పరిణామాలు జరగకుండా గట్టి చర్యలు చేపట్టాలని , పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడం. జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని సూచించారు. ఇన్విజిలేటర్స్ ఉదయం 8 గంటలకు పరీక్ష కేంద్రాల కు చేరుకొని అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని అన్నారు . విద్యార్ధులు బ్లూ, బ్లాక్ పెన్స్ మాత్రమే వాడాలని, ఓఆర్ ఎం షీట్స్ విద్యార్ధులకు అందించే సమయం లో జాగ్రత్తలు పాటించాలని ఆన్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ రికార్డ్ అవుతుందా లేదా చెక్ చేయాలని, పరిక్షలకు సంబంధించిన ప్రతిదీ సీసీ కెమెరా ల సమక్షం లోనే జరగాలని ఆదేశించారు. ముఖ్యంగా విద్యార్ధులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పరీక్ష కేంద్రాలలో త్రాగునీరు ఫర్నిచర్ అన్ని సదుపాయాలు ఏర్పాటుచేయాలని , టాయిలెట్స్ శుభ్రంగా ఉంచాలని అన్నారు . మాల్ ప్రాక్టీస్ జరగకుండా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. హాల్ టికెట్ తీసుకొని వారు వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చునని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్ష కేంద్రాలలోకి విద్యార్థులు, అధికారులు పరీక్షల సిబ్బంది ఎవరు కూడా పరీక్ష కేంద్రాలలోకి మొబైల్స్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని స్పష్టం చేశారు. పరీక్షలు పూర్తయ్యాక ప్రశ్న పత్రాలను పోలీస్ బందోబస్తుతో తరలించాలని. పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన అన్ని మందులతో పాటు వారికి ఓఆర్ ఎస్‌ ప్యాకెట్ల తో సహా వైద్య బృందాల ఏర్పాటు , అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరాను అందించాలని. సకాలంలో విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థుల సౌకర్యాలతో బస్సులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. సిబ్బంది పరీక్షల నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ పరీక్ష కేంద్రాలకు చీఫ్ సూపరిండెంట్లు, శాఖలఅధికారులు, ఇన్విజిలేటర్ లు సిట్టింగ్. ఫ్లయింగ్ స్కాడ్స్. ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో ఆర్డీఓ, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *