సిరా న్యూస్, డిజిటల్:
ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారిని కలిసిన గెస్ట్ లెక్చరర్లు
ప్రభుత్వ డిగ్రీ మరియు ఇంటర్ కళాశాలల గెస్ట్ లెక్చరర్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని ఆదివారం హైదరాబాద్ పట్టణం గచ్చిబౌలిలోని రోలింగ్ హిల్స్ లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ ప్రధాన డిమాండ్లు అయినటువంటి ఆటో రెన్యువల్, కన్సాల్డేడ్ పే తో పాటు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించి నరేందర్ రెడ్డి, ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు లెక్చరర్లు తెలిపారు. కాగా విద్యా కమిటీ మెంబెర్ కోదండరాం, చిన్నారెడ్డిలను సైతం కలిసి డిమాండ్ల గురించి విన్నవించాలని, నరేందర్ రెడ్డి సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు డా. కొర్ర ఈశ్వర్ లాల్, పీజీ గెస్ట్ లెక్చలర్ల జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కరుణాకర్, లెక్చలర్లు కిషోర్, హాము నాయక్, వెంకటేశ్వర్లు, ఇంటర్ గెస్ట్ లెక్చరర్స్ శ్రీధర్ ఆచారి, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.