సిరాన్యూస్, కళ్యాణదుర్గం
పదవ తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు 6,23,092 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉ.9:30 నుంచి మ.12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. మొత్తం 3,473 పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనెల 18 తేదీ నుండి 30 తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు రాసే ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. విద్యార్థులు ఇంటి నుండి పరీక్ష కేంద్రం వరకు అన్ని పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణం చేయడానికి ఆర్టీసీ వారు సదుపాయం కలిగించే విద్యార్థులు విషయాన్ని గమనించాలని కోరారు.