Raithunestham: వీడియోకాన్ఫరెన్స్‌ ద్వార రైతులకు అవగాహణ

సిరా న్యూస్, జైనథ్‌:

వీడియోకాన్ఫరెన్స్‌ ద్వార రైతులకు అవగాహణ

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండల కేంద్రంలోని రైతువేధిక భవనంలో మంగళవారం రైతులకు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వార అవగాహణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయాధికారి వివేక్‌ తెలిపారు. ఉదయం 9:30 గంటల నుండి 11:30 గంటల వరకు ఆయిల్‌పామ్‌ సాగు, వేసవిలో కూరగాయాల సాగుపై శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు అందిస్తారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతునేస్తం కార్యక్రమం ద్వార ప్రతీ మంగళవారం రైతువేధికలో వీడియోకాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *