ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

సిరా న్యూస్,షాద్ నగర్;
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండల పరిధిలోని ఎంఎస్ఎన్ కంపెనీ బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైసూర్ నుండి వారణాసి ఈకో కారు లో బయలుదేరిన ఆరుగురు పండితులు ప్రయాణిస్తున్న కారు షాద్ నగర్ వైపు నుండి ఎమ్మెస్ ఎన్ కంపెనీ సమీపాన రాగానే ప్రమాదవశాత్తు కారు చెట్టు కు ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పండితులు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన నలుగురికి చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *