సిరాన్యూస్, బేల
నిమిషం నిబంధన తొలగింపు...
బేల మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లలో సోమవారం నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం.
పదో తరగతి పరీక్షలో నిమిషం లేటైనా విద్యార్థులకు పరీక్ష సెంటర్ లోకి అనుమతి ఉందని అయినప్పటికీ విద్యార్థులు పరీక్ష కేంద్రానికి సరైన సమయంలో చేరుకోనెల చూసుకోవాలని అధికారులు అన్నారు.ఈ సందర్బంగా పరీక్ష కేంద్రం డిపార్ట్మెంట్ అధికారి మాట్లాడుతూ ఇక్కడ దాదాపుగా 198 మంది విద్యార్థులు హాజారు కానున్నారని అన్నారు.మార్చి 23 వరకు జరిగే పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరుగనున్నాయి అని అన్నారు.అయితే, పరీక్ష సెంటర్ కు ఒక్క నిమిషం ఆలస్యమైనా సెంటర్లలోకి విద్యార్థులను అనుమతి ఉంటుందని ఆలస్యం కాకుండా చూసుకోవాలని పేర్కొన్నారు.పకడ్బందీ ఏర్పాట్లతో పాటు విద్యార్థులు మానసిక ఒత్తిడికి గరీ కాకుండా తగిన చర్యలు తీసుకుంటునమన్నారు. పరీక్ష కేంద్రంలో ఎలాంటి అవాంచానియా సంఘటనలు జరగకుండా పూర్తి ఏర్పాట్లు చేశామని అన్నారు.