10th class exams:ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు

సిరాన్యూస్,బోథ్‌
ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పదవ తరగతి పరీక్షలు నాలుగు సెంటర్లలో సోమ‌వారం నిర్వ‌హించారు. 650 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 649 ముందు విద్యార్థులు పరీక్షలు రాశారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలలో 202 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా ఒకరు గైర్హాజర్ అయ్యారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు కౌటా (బి), సోనాల రెండు సెంటర్లలో పరీక్షలు రాశారు. విద్యార్థులు గంట ముందుగా పరీక్ష కేంద్రాల చేరుకొని వారి వారి హాల్ టికెట్ నెంబర్లను చూసుకోవడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *