సిరాన్యూస్, ఆదిలాబాద్
సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా పని చేయాలి
* జిల్లా పాలనాధికారి రాజర్షి షా
* పోషణ పక్షం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించండి
సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా పని చేయాలని జిల్లా పాలనాధికారి రాజర్షి షా అన్నారు. పోషణ పక్షం కార్యక్రమం పై సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరము లో జిల్లా పాలనాధికారి రాజర్షి షా .ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి లతో కలసి మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ పెరటి తోటలో అనుబంధ పౌష్టిక ఆహారంపై గ్రామంలోని ప్రజలకు అవగాహన కల్పించాలని గర్భిణీలు బాలింతలు చిన్నారులలో పౌష్టికాహార లోపం అధిగమించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అంగన్ వాడి కేంద్రాలలో పోషణ్ పక్వాడ (పోషణ పక్షం) నిర్వహించాలన్నారు. పోషణ పక్షం అన్ని అంగన్వాడి కేంద్రాలలో నిర్వహించాలన్నారు. చిరుధాన్యాల ఉపయోగము , ప్రాధాన్యత గురించి ఈనెల 23 వరకు గ్రామస్థాయిలో అంగన్ వాడి కేంద్రాల ద్వారా అవగాహన కలిగించాలని తెలిపారు. బుధవారం విలేజ్ హెల్త్ శానిటేషన్, న్యూట్రిషన్ డే సందర్భముగా అన్ని అంగన్ వాడి కేంద్రంలో లైన్ డిపార్ట్మెంట్ వారిని పిలిచి వంటకాల ప్రదర్శన రక్తహీనత, తదితర అంశం పై నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించాలని తెలిపారు.అనంతరం వాటికి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్, హెల్త్ ఎడ్యుకేషన్ సివిల్ సప్లై డి ఆర్ డి ఎ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.