సిరాన్యూస్, చిగురుమామిడి
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించరాదు
* చిగురుమామిడి ఎస్ఐ బండి రాజేష్
ఎన్నికల ప్రవర్తన నియమావళి ని ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకోబడుననీ చిగురుమామిడి ఎస్ ఐ బండి రాజేష్ తెలిపారు.2024 లోక్ సభ పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దృష్ట్యా ప్రతి ఒక్కరూ ప్రవర్తన నియమావళి లోబడి నడుచుకోవా ల్సి ఉంటుందినీ, 50 వేల రూపాయల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే సరైన రశీదులు చూపించాలని లేనిచో అట్టి నగదును స్వాధీనం చేసుకోవడం జరుగుతుందనీ తెలిపారు.రాజకీయ పార్టీలు ముందస్తు సమాచారం లేకుండా,అనుమతి లేకుండా ఏలాంటి ర్యాలీలు, సభలు సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర, విద్వేషకరమైన రెచ్చగొట్టి సందేశాలు పోస్ట్ చేసిన వారిపైన.. గ్రూప్ అడ్మిన్ల పైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఎన్నికల నియమావళికి లోబడి ప్రతి ఒక్కరూ నడుచుకుంటూ పోలీస్ శాఖ కు సహకరించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.