సిరా న్యూస్, సైదాపూర్
విగ్రహా పునర్ ప్రతిష్ఠకు మంత్రికి ఆహ్వానం
సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో ఈనెల 25,26,27 తేదీలలో జరగబోయే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహ పునర్ ప్రతిష్ట మహోత్సవానికి హాజరుకావాలని రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు బంజారాహిల్స్ లో ఉంటున్న తన నివాసం వద్ద వెన్నంపల్లి గ్రామస్తులు ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంత సుధాకర్, జిల్లా సీనియర్ అధ్యక్షులు గుండారపు శ్రీనివాస్, సింగిల్ విండో మాజీ చైర్మన్ అబ్బిడి వికేవర్థన్ రెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ సారబుడ్ల రాజిరెడ్డి, అబ్బిడి రవీందర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ మొలుగూరి చిరంజీవి, పేరాల ఆగమ రావు, హనుమాన్ దేవాలయ చైర్మన్ శంకర్ లింగం, సింగిల్ విండో డైరెక్టర్ బొమ్మగాని రాజు తదితరులు ఉన్నారు.