వైసీపీలో చేరిన టిడిపి నాయకులు

సిరా న్యూస్,సి. బెలగల్;
సి.బెళగల్ మండలం బ్రాహ్మణ దొడ్డి గ్రామం నుండి 50 మంది టీడీపీ నాయకులు కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారి సారద్యంలో కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డా. ఆదిమూలపు సతీష్ గారి సమక్షంలో వైసీపీ పార్టీ లోకి చేరారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ లో జగనన్న సంక్షేమం చూసి చేరుతున్నామని అన్నారు.కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు‌ మరియు కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్ గారు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం ద్వారా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు గడపగడపకు అందుతున్నాయని, ప్రతి గ్రామం, పట్టణం జగనన్న ప్రభుత్వంలో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. గతంలో టిడిపి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందాలంటే దళారులు ఉండేవారని, ఇప్పుడు ఎవ్వరికీ ఒక్కరూపాయి ఖర్చు చేయకుండా లబ్ధిదారులకు నేరుగా ఇంటికే పథకాలు అందుతున్నాయని అన్నారు. కావున రానున్న రోజుల్లో జగన్ ప్రభుత్వానికి అండగా ఉండేందుకు ప్రజలంతా ఎమ్మెల్యేకు ఆదిమూలపు సతీష్ గారికి, ఎంపి కు బివై రామయ్య గారికి, రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు ఓటువెయ్యలని కోరారు.ఈ కార్యక్రమంలో సి.బెలగళ్ మండల కన్వీనర్ సోమశేఖర్ రెడ్డి, బ్రాహ్మణ దొడ్డి సర్పంచ్ బోయ దస్తగిరి, గ్రామ నాయకులు చిన్న రాముడు, మేకల రాముడు, వెంకటేశ్వర్లు వడ్డే, శివ, నాగేష్, చిన్న పాంటయ్యా నగేష్, చిన్న వెంకటేష్, వడ్డే రాముడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *