సిరాన్యూస్, కళ్యాణదుర్గం
ప్రభుత్వ పరికరాలు స్వాధీనం చేసుకోండి
* ఓటర్లను ప్రలోబలకు గురిచేస్తున్నారు
* కళ్యాణదుర్గం రిటర్నింగ్ అధికారికి తెదేపా ఫిర్యాదు
కళ్యాణదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా గ్రామ పట్టణ వాలెంటర్లు ప్రభుత్వం పరికరాల్లో ఉండే డేటాను ( మొబైల్, స్టార్ టెక్ డివైజెస్ ) లను ఉపయోగించి ఓటర్లను ప్రలోబలకు గురి చేస్తున్నారని వెంటనే వాటిని స్వాధీనం చేసుకోవాలని తెదేపా కళ్యాణదుర్గం తరపున దేవినేని అవినాష్ చౌదరి రిటర్నింగ్ అధికారికి బుధవారం ఫిర్యాదు చేసారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజవర్గంలో పనిచేయుచున్న వాలంటీర్లు తమ వద్ద ఉన్న ప్రభుత్వం ద్వారా తీసుకున్న స్మార్ట్ ఫోన్స్, డైవర్స్ ద్వారా ఓటర్ల డేటా ద్వారా ఓటర్లను ప్రలోభ పెట్టడమే కాకా వారిని ఒక పార్టీ వైపు ప్రభావితం చేస్తున్నారని, మా దృష్టికి వచ్చింది.అక్కడక్కడ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనుచున్న వారిని గమనించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.