ఏసీబీ వలలో మడకశిర సబ్ రిజిస్ట్రార్

సిరా న్యూస్,మడకశిర;
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర సబ్ రిజిస్ట్రార్ దామోదర్ రూ.2.50 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. మడకశిర మండల పరిధిలోని గంతలపల్లికి చెందిన రైతు హనుమంతరెడ్డి తన 6.36 ఎకరాలఅసైన్డ్ భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని సబ్ రిజిస్ట్రార్ను ఆశ్రయించారు. ఎకరాకు రూ.50 వేల చొప్పున ఇవ్వాలని డాక్యుమెంట్ రైటర్ షమీవుల్లా ద్వారా డిమాండ్ చేయగా రూ.2.50 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు.డబ్బు తీసుకునే సమయంలో సబ్ రిజిస్ట్రార్ తో పాటు డాక్యుమెంట్ రైటర్ ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి తెలిపారు.
===================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *