Athram sakku:విజయమే లక్ష్యంగా ముందుకెళ్తాం

సిరాన్యూస్‌,ఆదిలాబాద్‌
విజయమే లక్ష్యంగా ముందుకెళ్తాం
* బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు
* ఎన్నికల సన్నద్దతపై విస్తృతంగా చర్చ‌
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలో బుధవారం ఉమ్మడి జిల్లా పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై ఎన్నికల సన్నద్దతపై విస్తృతంగా చర్చించారు. మాజీ మంత్రి జోగురామన్న, ఎమ్మెల్సీ దండె విట్టల్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, పార్టీ ముఖ్య నాయకులు జాన్సన్ నాయక్, రాం కిషన్ రెడ్డి, లోలం శ్యాం సుందర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రణాళికలు, ప్రచార వ్యూహాలు, ఇతరత్రా అంశాలపై చర్చించారు. ఈ మేరకు బీ.ఆర్.ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు మాట్లాడుతూ తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రపథంలో నిలిపెలా గత బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన పార్టీ అధినేత కెసిఆర్, కే.టీ.ఆర్, హరీష్ రావు లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేశారు. పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ ల ఇంచార్జ్ లు, ముఖ్య నేతలతో సమావేశమై ఎన్నికల సన్నద్దతపై చర్చించినట్లు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *