సిరాన్యూస్,బోథ్
భక్తితో మానసిక ప్రశాంతత
* ఆశ్రమాల అభివృద్ధికి తన వంతు సహకారం
* బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్
* భక్తులకు అన్నదానం
భక్తితో మానసిక ప్రశాంతత కలుగుతుందని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ అన్నారు. ఆదిలాబాద్ బోథ్ మండలంలోని కౌటా (బి) గ్రామంలో బుధవారం నిర్వహించిన శబరిమాత ఆలయ 12 వ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తితో మానసిక ప్రశాంతత ఉంటుందన్నారు. శబరిమాత ఆశ్రమ భక్తులు వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించి జిల్లాలోని వివిధ ఆశ్రమాల నుండి భక్తులను ఆహ్వానించడం అభినందనీయం అన్నారు జిల్లా వ్యాప్తంగా శబరిమాత ఆశ్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను సన్మార్గంలో నడిపించేందుకు చేస్తున్న కృషిని ఎమ్మెల్యే అభినందించారు సమీప భవిష్యత్తులో ఆశ్రమాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామన్నారు కాగా వార్షికోత్సవ సందర్భంగా వివిధ గ్రామాల భక్తులతో కలిసి ఊరేగింపు నిర్వహించారు ఉదయం పూట ప్రత్యేక పూజా కార్యక్రమాల నిర్వహించిన అనంతరం శబరిమాత పల్లవిని ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు ఆనందోత్సవాల మధ్య పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి హాజరైన శివానంద స్వామి తో పాటు శబరిమత శిష్యులు అల్లూరి నర్సింగ్ రెడ్డి తదితరులు ఊరేగింపులో పాల్గొని శబరిమాత చూపించిన మార్గంలో పయనించాలని కోరారు.