సిరాన్యూస్,తలమడుగు
కేంద్ర మంత్రిని సన్మానించిన సుహాసిని రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఉండం గ్రామంలోనీ ఫంక్షన్ హాల్ లో బుధవారం జరిగిన బారతీయ జనతా పార్టీ లో చేరికల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి అర్జున్ ముండా హాజరయ్యారు. ఈసందర్భంగా కేంద్ర మంత్రి అర్జున్ ముండా, ఎం పి అభ్యర్థి గొడం నగేష్ లను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి శాలువా కప్పి సత్కరించారు.