సిరా న్యూస్,మహబూబ్ నగర్;
పెంపుడు కుక్కల మీద ప్రేమ వీధి కుక్కలను కాల్చిచంపే వరకు తెచ్చింది. మహబూబ్నగర్ జిల్లాలో కలకలం రేపిన కుక్కల కాల్చివేత ఘటనలో ఎట్టకేలకు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మిస్టరీగా మారిన ఈదారుణానికి అసలు కారణాలు బయటపెట్టారు ఖాకీలు. గత నెల ఫిబ్రవరి 15న ఉమ్మడి పాలమూరు జిల్లా పొన్నకల్ గ్రామంలో వీధి కుక్కల కాల్చి చంపిన ఘటన సంచలనం రేపింది.
గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రిదాటిన తర్వాత గ్రామ మొత్తం తిరుగుతూ కనబడిన ప్రతి కుక్కను తుపాకీతో కాల్చిచంపారు. ఓ వైపు కుక్కల అరుపులు, మరోవైపు బుల్లెట్ల చప్పుడుకు గ్రామంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. భయాందోళనకుగురైన గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. తీరా ఉదయం లేచి చూసేసరికి గ్రామంలోని వీధుల్లో కుక్కలు రక్తపు మడుగులో చనిపోయి దర్శనిమిచ్చాయి. సుమారు 25కుక్కలను దుండగులు కాల్చి చంపారు.గ్రామస్తుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.