+ మాదస్తు సాయి, డోకే సంతోష్లపై కేసు నమోదు
+ వివరాలు వెల్లడించిన పోలీసులు
సిరా న్యూస్, జైనథ్:
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని గిమ్మ–కే, మేడిగూడ(ఆర్) గ్రామాల్లో నిర్వహిస్తున్న బెల్ట్షాప్లపై జిల్లా ఎస్పీ గౌస్ ఆలం అదేశాల మేరకు జైనథ్ పోలీసులు దాడులు నిర్వహించారు. బుధవారం సీఐ డి సాయినాథ్, ఎస్సై పురుషోత్తంలు ముందస్తు సమాచారం మేరకు దాడులు నిర్వహించగా, గిమ్మలో రూ. 65వేల విలువ చేసే 96లీటర్ల మద్యం, మేడిగూడలో రూ. 25వేల విలువ చేసే 50లీటర్ల మద్యం లభించినట్లు వారు తెలిపారు. గిమ్మ బెల్ట్షాప్ నిర్వహకుడు మాదస్తు సాయి, మేడిగూడ బెల్ట్షాప్ నిర్వహకుడు డోకే సంతోష్లపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు వారు తెలిపారు. కాగా పార్లమెంట్ ఎన్నికల కోడ్ను అమలులో ఉన్నందున బెల్ట్షాప్ నిర్వహించే వారిపై కేసులు తప్పవని వారు తెలిపారు.