సిరాన్యూస్, బేల
పశువులకు గాలి కుంటు టీకాలు
* మండల పశు వైద్య అధికారి సిద్ధార్థ్ కాంబ్లే
పశువులకు గాలి కుంటు టీకాలు వేయించాలని బేల మండల పశు వైద్య అధికారి సిద్ధార్థ్ కాంబ్లే అన్నారు.
బుధవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని ఖోగ్డుర్, కొబ్బయి, పాఠన్, మాంగ్రోడ్ గ్రామాలలో ఏద్దులు, ఆవులు, బర్రెలు పశువులకి గాలికుంటూ టీకాలు వేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. గాలికుంటు టీకాలు బేలా మండల కేంద్రం లో గల ప్రతి గ్రామంలో ఏప్రిల్ 5వ తేదీ వరకు ఈ క్యాంపు కొనసాగిస్తామని అన్నారు. ఈ క్యాంపును రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కార్య క్రమంలో గ్రామస్తులు, బేల మండల పశువైద్య సహాయకులు అల్లం హరీష్ ,మండల స్టాప్ పాల్గొన్నారు.