సిరా న్యూస్, కుందుర్పి
రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి
* ఇద్దరు కుమారులకు గాయాలు
రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందగా, ఇద్దరు కుమారులకు తీవ్రగాయాలైన సంఘటన కళ్యాణదుర్గం పట్టణంలో గురువారం చోటు చేసుకుంది.వివరాలు ఇలా ఉన్నాయి. కంబదురుఎగువపల్లి గ్రామానికి చెందిన గోపాల్ బ్రతుకు తెరువు కోసం పట్టణంలో స్థిరపడి టైలర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండు నెలలు క్రితం పార్వతి నగర్ లో కొత్త ఇల్లు కట్టించాడు. ఇద్దరు కుమారులతో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్నా తరుణంలో పట్టణంలోని కరెంట్ ఆఫీస్ వద్ద బొలెరో వాహనం ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై గోపాల్ అక్కడిక్కడే మృతి చెందగా, ఇద్దరు కుమారులకు తీవ్రగాయాలయ్యాయి. నాన్న అని ఏడుపులు అస్పత్రి అక్కడున్న వారిని కంట తడపేటీచింది.ఇంకో కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.