సిరా న్యూస్, బేల
నత్తనడకన పీహెచ్సీ పనులు
* ఇబ్బందుల్లో రోగులు
* పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో పీహెచ్పీ నూతన భవన పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. పీహెచ్సీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి సంవత్సరం గడుస్తున్నా నేటికీ పునాది దశలోనే ఉన్నాయి.గత ప్రభుత్వం హయాంలో జిల్లాలో ని తలమడుగు, బేల మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర లను ఒకేసారి మంజూరు చేయడం జరిగింది.ఇతర మండలంలోని పీహెచ్సీ భవనం మరో నెలలో ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నా బేల మండల కేంద్రంలో నేటికీ పునాది దశలోనే పనులు కొనసాగుతున్నాయి. గుత్తేదారుని నిర్ల్యక్షమో మరి జిల్లా పంచాయతీ రాజ్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం స్పష్టంగా కనిపిస్తున్నాయి.మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక కోటి 50 లక్షల రూపాయలు మంజూరైన నేటికీ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి.ఒక పక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన మండల సమైక్య అద్దె భవనంలో కొనసాగుతున్నది.
సరైన వసతులు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ కృష్ణవంశీ తెలిపారు. ఇక్కడ వచ్చే రోగులకు సరైన చికిత్స చేయడంలో చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
పనులు ప్రాంభమయ్యేలా చూస్తాం…. ( కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్)
మండల కేంద్రంలో గల పిహెచ్సి భవనం పనులు ప్రారంభం కాలేదని తమ దృష్టికి రావడం జరిగిందని, నేటికీ భవనం పనులు పునాది దశలోనే ఉండడం చాలా బాధాకరం. వెంటనే జిల్లా ఇన్చార్జి మినిస్టర్ సీతక్క దృష్టికి తీసుకెళ్లి పనులు ప్రారంభం అయ్యేలా చూస్తాం.